Sankar vilas RoB updates: గుంటూరువాసులకు గుడ్ న్యూస్. త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. గుంటూరు శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం ఇక మరింత వేగంగా జరగనుంది. రైల్వే బోర్డుకు చెందిన భూమార్పిడి కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్వోబీ పనులు మరింత వేగం పుంజుకుంటాయంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్రానికి, రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు.