చాలా మంది ట్రైన్ ప్రయాణాలు చేస్తుంటారు. అయితే అనుకోని కారణాల వల్ల కొన్ని సార్లు ట్రైన్లు క్యాన్సిల్ అవుతాయి. మరికొన్ని సార్లు మనమే ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకుంటాం. అలాంటి సమయాల్లో ఆన్లైన్ ఈ-టికెట్ల డబ్బులు సులభంగా రిఫండ్ అవుతాయి. అయితే స్టేషన్లో ముందస్తుగా టికెట్లు తీసుకుంటే ఆ డబ్బులు ఎలా రిఫండ్ చేసుకోవాలనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు.