సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ (నాంపల్లి), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్న రెండు ట్రైన్లను ఇక నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి నడపనున్నారు. అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇకపై ఆ రెండు ట్రైన్లలో జర్నీ చేయాలంటే సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ కాకుండా చర్లపల్లి వెళ్లి ఎక్కాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.