రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లకు అదనంగా ఒక్కో థర్డ్ ఏసీ బోగీని శాశ్వత ప్రాతిపదికన జత చేయనుంది. ఈ మార్పు జులై 13, 14 తేదీల నుండి అమలులోకి రానున్నాయి. దీనివల్ల థర్డ్ ఏసీ బెర్త్ల లభ్యత పెరిగి, ప్రయాణికులు సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు. గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, విజయవాడ-కాచిగూడ, విజయవాడ-చెన్నై మార్గాల్లో నడిచే రైళ్లకు ఈ అదనపు బోగీలు ఉంటాయి.