దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల వేగం గంటకు 130 కిలోమీటర్లకు పెరగనుంది. దీనికోసం రూ.3,200 కోట్లతో ట్రాక్లపైకి పాదచారులు, పశువులు, వాహనాలు రాకుండా ఈ-ఫెన్సింగ్, సరిహద్దు గోడల నిర్మాణం చేపట్టారు. అత్యధిక రద్దీ మార్గాల్లో ఫెన్సింగ్కు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల సౌకర్యార్థం సబ్వేలు కూడా నిర్మిస్తున్నారు.