హైదరాబాద్ నుంచి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్న ట్రైన్ ప్రయాణికులకు ఐఆర్సీటీసీ తీపి కబురు చెప్పింది. నగరం నుంచి మరికొన్ని ప్రాంతాలకు భారత్ గౌరవ్ వేసవి స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. ఈ నెల 23 నుంచి జూన్ 12 వరకు మొత్తం ప్రత్యేక ట్రైన్లు నడవనున్నాయి. మెుత్తం నాలుగు ప్యాకేజీలుగా భారత్ గౌరవ్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.