ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 16 రైళ్లకు అదనపు బోగీలను జత చేయనున్నారు. ఆగస్టు 10 నుండి 20 మధ్య వివిధ రైళ్లకు ఈ అదనపు బోగీలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని రైళ్లకు ఒక్కో బోగీ, మరికొన్నింటికి స్లీపర్ బోగీలు, ఇంకొన్నింటికి జనరల్ బోగీలు పెంచనున్నారు. ఈ నిర్ణయం ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించనుంది.