డఫా బెట్ బెట్టింగ్ కేసులో తెలంగాణ పోలీసులు కీలక విజయం సాధించారు. అమాయకులను మోసం చేసి.. రూ.లక్షల్లో వసూలు చేసిన కేసులో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి భారీగా డబ్బు, కార్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, పాస్పోర్టులు సీజ్ చేశారు. నిందితులపై పలు రాష్ట్రాల్లో మొత్తం 200కు పైగా కేసులు నమోదైనట్లు గుర్తించారు.