తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్లో రూ.83 లక్షలు కాజేసిన బొమ్మిడిశెట్టి హరిబాబును జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. తాను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేశానని నమ్మబలికి.. 83 మంది నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశాడు. ఆ డబ్బుతో ఇల్లు కట్టినట్టు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.