హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీల్లో నిర్మించిన 1400లకు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత ఏప్రిల్ 9, 10 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని 273 షాపులకు వేలం నిర్వహించనున్నారు. ఈ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంబంధిత కాలనీల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఆసక్తి గల వారు నిర్ణీత ధరావతుతో రిజిస్టర్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.