ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించకుండా ఖాళీగా ఉంచుతున్న లబ్ధిదారులపై హౌసింగ్ కార్పొరేషన్ చర్యలకు సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లాలోని 16 ప్రాంతాల్లో 3900 మందికి రెండోసారి నోటీసులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా ఇళ్లలోకి మారకపోతే కేటాయింపులు రద్దు చేసి, ఇళ్లను స్వాధీనం చేసుకుని వెయిటింగ్ లిస్ట్లోని అర్హులైన పేదలకు కేటాయించనున్నారు. గ్రేటర్ పరిధిలో 10 వేల నుంచి 15 వేల ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.