Markapuram Lecturer Arrest For Threatens Student: మార్కాపురం జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ప్రైవేట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్.. అక్కడే చదివే ఇంటర్ విద్యార్థినిని డబ్బుల కోసం బెదిరించాడు. బాలిక దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు తీసుకురమ్మని బెదిరించాడు. ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా రూ.9 లక్షల విలువ గల బంగారం అతడికి ఇచ్చింది. అసలు సంగతి తెలిసి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.