మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్పై అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. అనంతరం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. సొంత మంత్రుల ఫోన్లను కూడా డార్క్ వెబ్ టూల్స్ ద్వారా హ్యాక్ చేస్తున్నారని, దీనిపై సిట్కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.