డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం సీబీఐ దర్యాప్తుకు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు సహకరించాలని నోటీసులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సాధారణంగా సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి వీలు కలిగించే జనరల్ కన్సెంట్ను గత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఇచ్చి సహకరించాలని నోటీసుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది.