విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగుల కోసం ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ కీలక చర్యలు తీసుకుంటోంది. విభిన్న ప్రతిభావంతులకు డిజిటల్ విద్యా బోధనతో పాటుగా వారికి ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. సర్వే ద్వారా విభిన్న ప్రతిభావంతులను గుర్తించి స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు. అనంతరం స్కూలుకు వచ్చేందుకు రవాణా భత్యం చెల్లిస్తున్నారు. సహాయకులను ఏర్పాటు చేసుకుంటే సహాయకులకు కూడా భత్యం చెల్లిస్తున్నారు.