Farmer uses GPS to track down thieves: తన పొలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు అతన్ని ఆవేదనకు గురిచేశాయి. పదే పదే తన పొలంలోని డ్రిప్పు పైపులను చోరీచేస్తున్న వారి సంగతి చూడాలనుకున్నాడు. గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో ఈసారి తనే సొంతంగా ప్లాన్ చేసుకున్నాడు. పక్కాగా ప్లాన్ అమలు చేసి.. చోరీ చేసిన వ్యక్తులను పట్టేసుకున్నాడు. పోలీసులకు అప్పగించాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన అశోక్ రెడ్డి అనే రైతు చేసిన పనిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.