ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా తన శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బుక్లెట్లు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి బుక్ లెట్.. నర్సీపట్నం ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి అందజేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 312 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు ఆయనకు వివరించారు.