భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ జయసూర్య అవినీతికి పాల్పడుతున్నారని.. జూద శిబిరాలకు సహకరిస్తున్నారని అక్టోబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా డీఎస్పీకి మద్దతు తెలపడంతో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. చివరకు శాఖాపరమైన విచారణ తర్వాత.. జయసూర్యను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.