బీటెక్ చదువును మధ్యలోనే ఆపేసిన ఆ యువకుడిది సొంతూరు రాజమండ్రి. అయితే, ఉపాధి కోసమని హైదరాబాద్కు వచ్చాడు. తీరా ఇక్కడకు వచ్చాక బెట్టింగ్లు, ఆన్లైన్ గేమింగ్లకు అలవాటుపడ్డాడు. దీంతో మోసాలు చేసి డబ్బులు సంపాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు ఆడేవాడు. చివరకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ను అడ్డగా మార్చుకుని.. అనేక మంది అమ్మాయిల్ని, మహిళలను బోల్తా కొట్టించాడు. నాలుగు రాష్ట్రాల్లో అతడి బాధితులు ఉన్నారంటే ఏ రేంజ్లో మోసాలకు పాల్పడ్డాడో అర్థమవుతుంది.