తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తుకు ముందే 'ఆన్లైన్ రోడ్డు భద్రత పరీక్ష' తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. మూడు గంటల పాటు సాగే ఆరు వీడియో మాడ్యూల్స్ శిక్షణ పూర్తి చేస్తేనే ఎల్ఎల్ఆర్ దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టి, డ్రైవర్లలో క్రమశిక్షణ పెంచడమే ఈ కొత్త మూడు దశల విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.