Andhra Pradesh Dwcra Women Digi Lakshmi Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేందుకు 'డిజి లక్ష్మి' కియోస్క్లను ప్రవేశపెడుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తుంది. సంక్షేమ పథకాలు, ధ్రువపత్రాలు, బిల్లుల చెల్లింపులు, టికెట్ రిజర్వేషన్లు వంటి 20 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు, ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే దీని లక్ష్యం.