Andhra Pradesh Government Stree Nidhi Loans To Dwcra Women: ఏపీలో మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి రుణాలు మంజూరు చేస్తోంది. ఒక్కో డ్వాక్రా సంఘానికి గరిష్ఠంగా రూ.8 లక్షలు వరకు రుణం ఇస్తారు.. ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష వరకూ మంజూరు చేస్తారు. అర్హులైన వారు ఈ రుణాలను పొందొచ్చని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ రుణాలు చెల్లించేందుకు ప్రత్యేకంగా యాప్ను కూడా తీసుకొచ్చారు.