AP Govt Increased Stree Nidhi Loans To Dwcra Women: ఏపీ ప్రభుత్వం స్త్రీనిధి రుణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సభ్యులకు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణం అందించనుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్షకు ఇది అదనంగా ఇస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష వడ్డీలేని రుణం అందించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది రూ.3 వేల కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది.