డ్వాక్రా సంఘాలకు శుభవార్త. స్త్రీనిధి రుణాల మంజూరులో నిబంధనలు సడలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్పీఏ జాబితాలో ఉండి.. స్త్రీనిధి రుణాలు అందని డ్వాక్రా సంఘాలకు కూడా ఇకపై రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి 8 లక్షల రూపాయలకు పెంచారు. దీంతో అనంతపురం జిల్లాలోని పలు మండలాలో ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.