ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుంది. 43 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఆప్ పార్టీ అభ్యర్థులు 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన రాహుల్కు కంగ్రాట్స్ అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.