తెలంగాణకు పరిశ్రమలు రావాలని.. పెట్టుబడులు పెరగాలని.. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసులు ఎవరికి చేతనైనంత వారు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. జపాన్ దేశ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో ‘జపాన్ తెలుగు సమాఖ్య’ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.