జనగామ జిల్లా మరిగడికి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండ్రి కారు కొనివ్వలేదన్న కారణంతో సాయిరాజ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని సూసైడ్కు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.