బండి భగీరథ్ పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తన కుమారుడిని బండి సంజయ్ అప్పగించాలని సూచించారు. పోక్సో కేసు నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారీలో ఉండటం తప్పు అని పేర్కొన్నారు. కుమారుడిని అప్పగిస్తేనే.. బండి సంజయ్పై గౌరవం పెరుగుతుందని వెల్లడించారు.