తనను చూసి నవ్వాడని నరికేశాడు.. రేణిగుంటలో దారుణం..

10 months ago 23
తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవ్వాడనే కోపంతో 17 ఏళ్ల కుర్రాడిని హత్య చేశారు. రేణిగుంటలోని గువ్వలకాలనీకి చెందిన మేస్త్రీ భార్య.. అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. అయితే ఈ కారణంతో తనను చూసి హేళనగా నవ్వాడని భావించిన మేస్త్రీ.. కుర్రాడి మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుర్రాడు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article