తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నవ్వాడనే కోపంతో 17 ఏళ్ల కుర్రాడిని హత్య చేశారు. రేణిగుంటలోని గువ్వలకాలనీకి చెందిన మేస్త్రీ భార్య.. అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. అయితే ఈ కారణంతో తనను చూసి హేళనగా నవ్వాడని భావించిన మేస్త్రీ.. కుర్రాడి మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుర్రాడు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.