ఏపీ రాజకీయాలు తిరుపతి గోశాల చుట్టూ తిరుగుతున్నాయి. గోవులు మృతి చెందాయని.. వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అధికార పక్షం వారి ఆరోపణలను తిప్పికొడుతోంది. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య నేడు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన తిరుపతి గోశాల సందర్శనకు వెళ్లగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. టీడీపీ వాళ్ల చేతుల్లో తన్నులు తినటానికి కూడా తాను సిద్ధమేనని ఆయన అనగా.. అక్కడే ఉన్న మాజీమంత్రి ఆర్కే రోజా భూమనకు మద్దతుగా రియాక్ట్ అయ్యారు.