పర్యావరణ పరిరక్షణలో భాగంగా తపాలా శాఖ ధాయ్ అఖర్ పేరుతో లేఖల పోటీలు నిర్వహిస్తోంది. భూమాతకు ఒక లేఖ.. ఈ ప్రకృతిని రక్షిస్తానని నా వాగ్దానం అనే అంశంపై ఒక లేఖ రాయాల్సి ఉంటుంది. అలా మనం రాసిన లేఖలను ప్రతి జిల్లా పరిధిలో మూడు చొప్పున ఎంపిక చేస్తారు. వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారు. అక్కడ ప్రథమ బహుమతి వచ్చిన లేఖకు రూ. 25 వేలు, ద్వితీయ బహుమతికి రూ. 10 వేలు, తృతీయ బహుమతికి రూ. 5 వేలు చొప్పున అందజేయనున్నారు.