Ap Govt Fact Check On Voltsun Labs: వోల్ట్సన్ ల్యాబ్స్ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది ప్రముఖ RJ గ్రూప్కు చెందిన సంస్థ అని, భూములు, ప్రోత్సాహకాల కోసమే ఏర్పాటు చేశారనే ఆరోపణలు అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఈ భారీ పెట్టుబడితో ఎన్నో ఉద్యోగాలు వస్తాయని కూడా తెలిపింది.