తమిళనాడు ఎఫెక్ట్.. తిరుపతిలో పోలీసులు తనిఖీలు.!

5 months ago 9
తమిళనాడులో పలువురు ప్రముఖుల నివాసాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు కూడా లభించలేదని తెలిసింది. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటితో పాటుగా బీజేపీ ఆఫీస్, సినీ నటి త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో తిరుపతి ప్రత్యేక పోలీస్ విభాగం అప్రమత్తమై సోదాలు నిర్వహించింది.
Read Entire Article