Tdp MP Magunta Srinivasulu Reddy Meet Cm Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ను పలువరు ప్రముఖులు కలుస్తున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సీఎం విజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తన మేనల్లుడు రామిరెడ్డితో కలిసి విజయ్ను సత్కరించారు. తమిళనాడు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. చెన్నైలో జరిగిన ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు అని చెబుతున్నారు.