AP Ayyappa Devotees Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామేశ్వరం సమీపంలో కారు ఆపి నిద్రిస్తున్న అయ్యప్ప భక్తులను లారీ ఢీకొట్టడంతో ఏపీకి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు, గజపతినగరం మండలానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.