తమ్ముడి మోసానికి ఓ అన్న తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోగా.. ఘోరంగా అవమానించి దాడి చేయటంతో మనస్తాపం చెంది తనువు చాలించారు. 8 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తెతో కలిసి చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్ధిపేట టౌన్లో చోటు చేసుకుంది.