తండ్రి మరణానంతర దుఃఖాన్ని దిగమింగుతూ.. మాగంటి గోపినాథ్ సతీమణి సునీత రాజకీయ భవిష్యత్తు కోసం కూతుళ్లు ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే అవకాశం తమ తల్లికి ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. కాలికి గాయమైనా ప్రచారంలో పాల్గొంటూ.. తల్లికి అండగా నిలబడాలనే వారి సంకల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.