తల్లికి వందనం నిధుల విడుదలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని.. కావాలని కొంతమంది సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.