తల్లికి వందనం పథకం డబ్బుల విడుదలపై కీలక అప్ డేట్ వచ్చింది. జూలై మూడో వారంలో తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేస్తారని సమాచారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చర్చ జరిగింది. విద్యార్థుల తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి జూలై మూడో వారంలో నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరులో డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి.