Nara Lokesh on Thalliki vandanam and DSC: ఏపీలో తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. తల్లికి వందనం పథకం పెండింగ్ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తల్లికి వందనం 325 కోట్ల రూపాయలు పెండింగ్ నిధులు విడుదలకు నారా లోకేష్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. మరోవైపు ఏటా డీఎస్సీ ప్రకటించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.