Talliki Vandanam Scheme 2025: ఏపీలో తల్లికి వందనం పథకం డబ్బులు ఇంకా రాలేదా?.. అయితే మీకో ముఖ్యమైన గమనిక. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పథకానికి సంబంధించిన పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు నవంబర్ 13, 2025 లోపు బ్యాంకు వివరాలు సరిచూసుకోవాలి. ఆధార్ లింకింగ్ తప్పనిసరి.. అర్హుల జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి. వెంటనే దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలాయల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.