వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వినాయకుడి పూజలో పాల్గొన్నారు. తాడేపల్లి వైసీపీ ఆఫీస్లో నిర్వహించిన గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా తొలిరోజున పూజలో కూర్చొని.. స్వయంగా హారతి ఇచ్చారు. వైఎస్ జగన్ హిందూ ఆలయాలకు వెళ్లరని.. పూజల్లో పాల్గొనరని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన వినాయకుడి పూజ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.