సినీ నటుడు నందమూరి తారకరత్న జయంతి సందర్భంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. తారకరత్న బతికి ఉంటే 43వ పుట్టినరోజు చేసుకునేవాడంటూ ఎమోషనల్ అయ్యారు. విధి చాలా త్వరగా అతన్ని మన నుంచి దూరం చేసిందని.. కానీ ఆయన చిరునవ్వు, జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మన గుండెల్లో శాశ్వతంగా ఉంటాయంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి విజయసాయిరెడ్డి బంధువు అవుతారు.