హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో తేమ పేరుతో అధికారులు ధాన్యం కొనకపోవడంతో, మొంథా తుఫాన్ ధాటికి కూరిసిన భారీ వర్షానికి వడ్లు కాస్త తడిచిపోవడంతో తారవ్వ గుండె చెరువయ్యింది. కలెక్టర్ కాళ్లపై పడి ఆదుకోమని వేడుకున్న ఆమెకు ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి ఆదేశాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, వెంటనే రూ.2.55 లక్షలు చెల్లించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రూ.50 వేల సాయం అందించారు. తనను ఆదుకున్న ప్రభుత్వానికి తారవ్వ ధన్యవాదాలు తెలిపింది. ఆ వివరాలు..