Tiruchanur Chennai Devotee Donated 8 Umbrellas Donated: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఘనంగా జరిగాయి. దాతలు అమ్మవారి వాహన సేవలకు గొడుగులు అందజేశారు. చెన్నైకు చెందిన భక్తుడు ఈ గొడుగుల్ని అమ్మవారికి కానుకగా అందజేశారు. రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, కళా బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.