Chittoor Road Accident: చిత్తూరు జిల్లా నగరి సమీపంలో తిరుపతి-చెన్నై హైవేలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరో 14మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో బస్సుకు ఒకపక్క సగభాగం వరకు ధ్వంసమైంది. బాధితులను స్థానికులు, పోలీసులు 108 వాహన సిబ్బంది కలిసి ఆస్పత్రికి తరలించారు.