Tirupati road accident: తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పాకాల మండలం తోటపల్లిలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అయితే కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.