తిరుపతి జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు కూలీలు చనిపోయారు. పిచ్చాటూరు మండలం హనుమంతపురంలో ఈ దుర్ఘటన జరిగింది. పొలంలో పనిచేస్తున్న నసమయంలో వీరిపై పిడుగు పడింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు పొలంలో పనికి వెళ్లిన ఇద్దరూ.. విగతజీవులుగా మారటంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. పెద్ద దిక్కులను కోల్పోయిన ఆ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.