సుమారు రూ.20 కోట్లు విలువైన గంజాయిని తిరుపతి పోలీసులు దహనం చేశారు. గత మూడు సంవత్సరాలలో వివిధ కేసులలో సీజ్ చేసిన 4100 గంజాయిని రేణిగుంట మండలంలోని ఎర్రంరెడ్డిపాలెం డంపింగ్ యార్డులో దహనం చేశారు. వీటి విలువ 20 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో గంజాయికి స్థానం లేదన్న పోలీసులు.. గంజాయి సాగు, అక్రమ తరలింపు పట్టుబడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే గంజాయి వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.