తిరుపతి: తొక్కిసలాట ఘటన ప్రభావం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం..!

1 year ago 28
TTD on Tirumala Vaikuntha Darshan Ticket Counters:వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 19 వరకూ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. అయితే మొదటి మూడు రోజులకు ఇప్పటికే టోకెన్లు జారీ చేయగా.. మిగిలిన రోజులకు ఎల్లుండి నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 40 వేల చొప్పున వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. అయితే మొన్న జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో.. తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాలను తగ్గించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం.
Read Entire Article